పుట్టినగడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి

తెలంగాణ అభివృద్ధిలో NRIలు భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానం అందుబాటులో ఉందన్నారు. ప్రవాసులు తమ విజ్ఞానం, అనుభవాన్ని సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.



