భూభారతితో అక్రమాలకు చెక్

TG: ధరణి పోర్టల్ వేదికగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై ఫాస్ట్ట్రాక్ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూలావాదేవీని సమగ్రంగా పరిశీలిస్తామని, పేదల భూములను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో 276 గ్రామాల్లో రీ సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్కు ప్రత్యేక 'భూధార్' సంఖ్య కేటాయిస్తామని తెలిపారు.



