TG

ఆయిల్‌పామ్ కంపెనీలకు తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్
TG· 1 Aug 2026

ఆయిల్‌పామ్ కంపెనీలకు తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్

TG: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోని కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 85వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని వెల్లడించారు. పలుమార్లు సమావేశాలు, నోటీసులు ఇచ్చినా పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. ఇకపై లక్ష్యాలు సాధించని కంపెనీల నుంచి జిల్లాలను వెనక్కి తీసుకుని ఇతర సంస్థలకు అప్పగిస్తామని హెచ్చరించారు.