← Back to news

ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటడమే లక్ష్యం

By dk· 3 Aug 2026
ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటడమే లక్ష్యం

తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొన్న ఆయన, NRI కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహంలో ప్రవాస తెలుగువారు కీలక పాత్ర పోషించాలని కోరారు. NRIలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

More in TG