← Back to news

పారదర్శకంగా సంక్షేమ పథకాలు: పొంగులేటి

By DK· 31 Jul 2026· భద్రాద్రికొత్తగూడెం జిల్లా
పారదర్శకంగా సంక్షేమ పథకాలు: పొంగులేటి

TG: ప్రజాసంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

More in TG