పెరిగిన వరద ఉద్ధృతి.. భద్రాచలంలో హైఅలర్ట్

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నీటిమట్టం 55.1 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల స్నానఘట్టాలు, సీతవాగు వద్ద పలు ప్రాంతాలు నీటమునిగాయి. చర్ల మండలంలోని ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల సమయంలో సీఐ, ఎస్సై వరద నీటిలో పడినా క్షేమంగా బయటపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






