← Back to news

నడుములోతు నీటిలో ప్రాణాలతో ప్రయాణం

By DK· 31 Jul 2026· కొమురంభీమ్ జిల్లా
నడుములోతు నీటిలో ప్రాణాలతో ప్రయాణం

TG: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని లక్ష్మిపూర్, అనార్పల్లి శివారులోని పెద్దవాగు <a href="https://www.theclearcutnews.com/n/knoZPWS">ఉప్పొంగి</a> ప్రవహిస్తుండటంతో సుమారు 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం కెరమెరికి వెళ్లాలంటే నడుములోతు నీటిలో ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More in TG