← Back to news

ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు కొత్త సూచనలు

By DK· 31 Jul 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు కొత్త సూచనలు

TG: సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ల నీటి వినియోగానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

More in TG