రేషన్ కార్డు KYC పేరుతో వసూళ్లు

హైదరాబాద్ LBనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో రేషన్ కార్డుల KYC పేరుతో కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లించిన తర్వాతే కేవైసీ పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



