TG

13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్
TG· 16 Jul 2026

13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ డివిజన్‌లోని వెంకటాద్రినగర్‌లో 1200 గజాల పార్కు స్థలం గత13 ఏళ్ల నుంచి కబ్జాకు గురైంది. వెంకటాద్రి నగర్ కాలనీ వాసుల సుదీర్ఘ పోరాటం ఫలిచింది. స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు TPCC ప్రచార కమిటీ ఛైర్మన్, ఎల్బీనగర్ ఇంఛార్జ్ మధు యాష్కి గౌడ్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాకు గురైన ఆ స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు
TG· 16 Jul 2026

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు

TG: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కల్మా చదువుకుని రావాలని ఓ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మత ప్రార్థనలను కూడా నేర్చుకుని రావాలని విద్యార్థి డైరీలో రాసి పంపించింది. అయితే ఆ డైరీ చూసిన విద్యార్థి పేరెంట్స్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని, అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారని ఫైరయ్యారు. కల్మా హోమ్‌వర్క్ చేయాలని ఒత్తిడి చేసిన టీచర్‌ను వెంటనే తొలగించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
TG· 16 Jul 2026

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం

TG: ధరణి పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 429ఎకరాల ఇనాం భూములను మాయం చేశారు. ఈ భూములపై పలువురు తమకు హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం, కోర్టులో కేసులు వేశారు. అదే అదనుగా కొందరు మెదక్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహీసీల్దార్‌లతో కుమ్మక్కై ఈ భూములను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.