TG· 16 Jul 2026
పోక్సో కేసులో కోర్ట్ సంచలన తీర్పు
TG: జగిత్యాల జిల్లా మెట్పల్లి PS పరిధిలో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురికి జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితులు రాజేశ్(22), సాయికుమార్ (21), అనిల్ (19), శివ (19), వెంకటేశ్(22)లపై 2020 అక్టోబర్లో మెట్పల్లి PSలో పోక్సో కేసు నమోదు అయింది. కేసులో ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.