వేస్ట్ ఫుడ్ బయటపడేస్తే హోటళ్లు సీజ్

TG: హైదరాబాద్ హబ్సిగూడలోని సుబ్రభాత్, అమరావతి హోటళ్లను మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలను బయట పారబోసినా, పశువుల ఫారాలకు పంపినా..వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెస్టారెంట్లు తడి వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం సొంతంగా ఇన్సీటు బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్లాంటు లేని హోటళ్లు జీహెచ్ఎంసీ వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్లకు మాత్రమే పంపాలని సూచించారు.



