హిందూ మతంలో విమర్శకు చోటుంది: ‘విజయవిహారం’ రమణమూర్తి

TG: హిందూ మతంలో విమర్శకు చోటు ఉంది కానీ, దుర్భాషలకు చోటు లేదని ‘విజయవిహారం’ రమణమూర్తి అన్నారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎవరిపైనా దాడి చేయకూడదని కోరారు. మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మామూలు చర్చలు సరిపోవని, మతపెద్దల దగ్గరకు వెళ్ళి సంస్కరణపై చర్చించాలన్నారు.



