← Back to news

పురిటినొప్పులతో విలవిలలాడినా పట్టించుకోలేదు

By DK· 16 Jul 2026

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని డాక్టర్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పురిటినొప్పులు ఎక్కువై నిల్చున్న చోటే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనను చూసి ఇతర రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు హాస్పిటల్‌కు వచ్చి విచారణ చేపట్టగా, వారికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

More in TG