అప్పుడు రంగరాజన్పై..ఇప్పుడు నాపై: ‘విజయవిహారం’ రమణమూర్తి

TG: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్పై దాడి చేసినప్పుడు, దాన్ని ఖండిస్తూ ఇక్కడికి వచ్చాననని..ఇవాళ తనపై జరిగిన దాడికి ఖండన తెలుపుతున్నారని ‘విజయవిహారం’ రమణమూర్తి తెలిపారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది చూస్తున్న లైవ్ ప్రోగ్రాంలో ఇలా దాడి చేసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో గమనించాలని అన్నారు.



