ఎంబీబీస్ చేయాలనుకునేవారికి గుడ్న్యూస్

TG: తెలంగాణలో ఎంబీబీస్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ శుభవార్త చెప్పింది. బుధవారం ఎంబీబీస్ సీట్లకు సంబంధించి ఎన్ఎంసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణలో ఏకంగా 810 ఎంబీబీస్ సీట్లను పెంచింది. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకు 110, ప్రైవేట్ కాలేజీలకు 600, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీలకు 100 సీట్లు అదనంగా కేటాయించింది. గత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 8,840 ఎంబీబీస్ సీట్లు ఉండగా, పెరిగిన సీట్లతో మొత్తం 9,650కు చేరుకున్నాయి.



