అయోధ్యలో అవినీతి వాళ్లకు సమస్య: ‘విజయవిహారం’ రమణమూర్తి

TG: తనపై దాడి చేసినవాళ్లకు రాముడు, కృష్ణుడు ముఖ్యం కాదని.. వాళ్లకు సమస్యంతా అయోధ్యలో అవినీతి అని ‘విజయవిహారం’ రమణమూర్తి అన్నారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చాలామంది తెలియనివాళ్లు తనకు కాల్ చేసి బెదిరిస్తున్నారని, అయినా తను భయపడనని అన్నారు.



