TG· 22 Aug 2026
ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలు
తెలంగాణలో ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని, నీటిని వృథా చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.