Viral· 17 Jul 2026
జీరో సివిక్ సెన్స్ అంకుల్!
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై నిల్చున్న వ్యక్తి అరటిపండు తింటూ, దాని తొక్కను రైలు ట్రాక్పై పడేశాడు. వీడియో తీస్తున్న ఒక యువకుడు అది చూసి, పక్కనే డస్ట్బిన్ ఉందని, అక్కడ చెత్త వేయొద్దని పదే పదే రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆ అంకుల్ ఏమాత్రం వినకుండా, చాలా నిర్లక్ష్యంగా స్పందించాడు. ఆ యువకుడు గట్టిగా నిలదీసి ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు అంకుల్కి ‘జీరో సివిక్ సెన్స్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.