Latest

'రామాయణ' డ్రెస్లపై డిజైనర్ల క్లారిటీ!
'రామాయణ' సినిమాలో సాయిపల్లవి, లారా దత్తాల డ్రెస్లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దీనిపై కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్ప్రీత్ నరులా స్పందించారు. 'త్రేతాయుగంలో ఎలాంటి బట్టలు వేసుకునేవారో కచ్చితమైన ఆధారాల్లేవు. ఇప్పటి యూత్కి ఈ కథ బాగా కనెక్ట్ అవ్వాలనే ఇలా డిజైన్ చేశాం. కేవలం వాళ్ల లుక్స్ మాత్రమే చూడకుండా, ఆ పాత్రల్లోని ఎమోషన్స్ను అర్థం చేసుకోండి' అని చెబుతున్నారు.
'Infotainment' వార్తలు
మారిన కాలానికి అనుగుణంగా మనం మారకపోతే వెనకబడిపోతామని BRS అధ్యక్షుడు KTR అన్నారు. రాయిటర్స్ సర్వే ప్రకారం, 18 నుంచి 24 ఏళ్ల యువత 56 శాతానికి పైగా వార్తలను, పేపర్లు లేదా TVల ద్వారా కాకుండా, సోషల్ మీడియా (Instagram Reels, WhatsApp, FB) లో వస్తున్న 'ఇన్ఫోటైన్మెంట్' (Information + Entertainment) రూపంలోనే పొందుతున్నారని ఆయన తెలిపారు.

ఉధయనిధి కామెంట్స్పై.. నటి ఖుష్బూ రియాక్ట్
ఉధయనిధి స్టాలిన్ కామెంట్స్పై నటి ఖుష్బూ స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. మహిళలను కించపరిచే, జెండర్ డిస్క్రిమినేషన్ను ఎంకరేజ్ చేసే వ్యాఖ్యలు గతంలో కూడా డీఎంకేలో చూశానని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఉధయనిధి నుంచి ఇలాంటి అసభ్యకర కామెంట్స్ ఊహించలేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని ఖుష్బూ తప్పుబట్టారు.

Bye-bye to cold water!
చల్లని WATER నీళ్ల కంటే నార్మల్ WATER (రూమ్ టెంపరేచర్) తాగడమే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదంతో పాటు డాక్టర్లు కూడా చెప్తున్నారు. నార్మల్ WATER తాగితే శరీరంలోకి త్వరగా ఇంకిపోయి, కణాలకు వెంటనే హైడ్రేషన్ ను ఇస్తాయి. ఇది జీర్ణక్రియను పెంచడమే కాకుండా, మెటబాలిజాన్ని వేగవంతం చేసి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా హెల్ప్ అవుతాయి.

మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్!
AIతో వస్తున్న 'డీప్ఫేక్' ఫోటోలు, వీడియోలు చూసి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు. తన ప్రమేయం లేకుండా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అస్సలు సరికాదని మండిపడ్డారు. నా ఫేస్ను వాడుతూ ఇలాంటి నకిలీ కంటెంట్ క్రియేట్ చేయడం, షేర్ చేయడం చట్ట ప్రకారం నేరం. ఇప్పటికైనా ఈ పనులు ఆపకపోతే సీరియస్ legal action తీసుకుంటాను, అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

పోలీస్ రిక్రూట్మెంట్పై CM ఎమర్జెన్సీ మీటింగ్!
TG: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీని కట్టుదిట్టంగా, పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామకాలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించడంతో అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్తో పాటు వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఎగ్జామ్ పేపర్, ఎగ్జామ్ సెంటర్ల మానిటరింగ్, కోచింగ్ సెంటర్లు, సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగాలు అలెర్ట్గా ఉండాలని సూచించారు.

వారానికి రెండుసార్లు తాగితే చాలు!
లైఫ్స్టైల్ మారడం, శారీరక కష్టం తగ్గడం వల్ల చాలామంది నడుము, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి నల్ల మినప జావ (ఉద్ది కంజి) బాగా పనిచేస్తుంది. పొట్టు తీయని నల్ల మినుముల్లోని ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ ఫైబర్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఈ జావను వారానికి రెండుసార్లు తాగడం వల్ల శరీర నొప్పుల నుంచి రిలీఫ్ రావడమే కాకుండా, మహిళల్లో నెలసరి ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. బరువు తగ్గి, పాతకాలపు బలాన్ని పొందడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

రాజధానిలో 123 అడుగుల కార్తికేయ విగ్రహం.. త్వరలో ప్రారంభం
AP: రాజధాని అమరావతి దగ్గర్లోని నవులూరులో 123 అడుగుల ఎత్తైన భారీ కార్తికేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి 2 కి.మీ. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కు 11 కి.మీ దూరంలో ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. స్థానికులు, దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో నాలుగు అంతస్తుల ప్రాకారం, ఆలయ నిర్మాణం కూడా కొనసాగుతోంది. త్వరలోనే భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.

Banana Chips vs Potato Chips
పొటాటో కంటే బనానా చిప్స్ మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలతో చేసే బనానా చిప్స్లో పొటాషియం, విటమిన్ C, B6, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగు చేయడంతో పాటు, బీపీ, షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి. పొటాటో చిప్స్ ప్రాసెస్ చేసి, ఎక్కువ వేడి మీద వేయించడం వల్ల పోషకాలన్నీ పోతాయి. వీటిలో సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్, బిపి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

ఇండియన్ షిప్ పై దాడి.. 13 మంది భారతీయులు?
ఎర్ర సముద్రం (Red Sea)లో ఇండియన్ షిప్ 'MSV Faize Noore Oliya' పై మిసైల్ దాడి జరిగింది. యెమెన్ జలాల దగ్గర్లో నిన్న జరిగిన ఈ ఘటనలో షిప్ మునిగిపోయింది. షిప్లో 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది స్టాఫ్ను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించి వైద్యసాయం అందించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, సిబ్బంది భద్రతతో పాటు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని DGMను ఆదేశించినట్లు వెల్లడించారు.

నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం
'సై' సినిమాలో భిక్షు యాదవ్, 'ఛత్రపతి' సినిమాలో రాజ్ బిహారీ పాత్రలతో తెలుగువారికి చేరువైన నటుడు ప్రదీప్ రావత్ ఇవాళ హఠాత్తుగా కన్నుమూశారు. ముంబైలోని ఆయన ఇంట్లో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన ఆయన 'సై' సినిమాకు ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు. 'గజిని' సినిమాలో విలన్గా డబుల్ యాక్షన్ చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

Love Bombing అంటే ఏంటి?
పరిచయమైన కొద్ది రోజులకే రోజంతా మెసేజ్లు, కాల్స్, గిఫ్ట్స్.. “నువ్వే నా లైఫ్” అంటూ ఓవర్గా ప్రేమ చూపిస్తున్నారా..? 👀❤️ దీన్నే కొన్ని సందర్భాల్లో లవ్ బాంబింగ్ అంటారు. మొదట చాలా ప్రేమ, అటెన్షన్ ఇచ్చి త్వరగా దగ్గరవుతారు. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ కంట్రోల్ చేయడం, తమ మాట వినాలని ప్రెజర్ పెట్టడం మొదలవ్వొచ్చు. అయితే ఎక్కువ ప్రేమ చూపించే ప్రతి ఒక్కరూ లవ్ బాంబర్స్ కాదు. ప్రేమతో పాటు కంట్రోల్ కూడా వస్తుందా? అనేదే చూడాలి.
PS నుంచి రిలీజ్ అయిన ఉదయనిధి స్టాలిన్!
తమిళనాడు ప్రతిపక్ష నేత DMK లీడర్ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ సస్పెన్స్గా ముగిసింది. రీసెంట్గా తంజావూరులో జరిగిన కావేరి నిరసన సభలో ఒక త్రిషపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అతనిపై కేసు ఫైల్ అయింది. దాంతో పోలీసులు ఆయనను చెన్నైలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి, తంజావూరు సమీపంలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఎంక్వైరీ పూర్తయ్యాక, హైకోర్టు ఉత్తర్వులతో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. స్టేషన్ బయట ఉన్న క్యాడర్కు ఆయన అభివాదం చేస్తూ వెళ్లారు.

‘Brain Rot’ అంటే తెలుసా?
ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీస్తాం.. చూస్తే గంట గడిచిపోతుంది! 📱 ఇలాంటి లో-క్వాలిటీ, రిపీటెడ్ ఆన్లైన్ కంటెంట్ను ఎక్కువగా చూడటం వల్ల మన ఆలోచనా సామర్థ్యం లేదా మెంటల్ స్టేట్ దెబ్బతింటోందనే భావనను ‘బ్రెయిన్ రాట్’ అంటారు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదు.. ఇంటర్నెట్లో పాపులర్ అయిన పదం మాత్రమే. ఈ పదం ఎంత ట్రెండ్ అయిందంటే Oxford Word of the Year 2024గా కూడా ఎంపికైంది. కంటెంట్ చూస్తున్నామా.. లేక స్క్రోలింగ్కే అలవాటు పడిపోయామా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్!

స్కిట్లో డైలాగ్స్ మర్చిపోయిన బాబూ మోహన్!
‘జబర్దస్త్’ షోలో ఈ వారం ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ జంట జయకృష్ణ, రషా తడాని సందడి చేశారు. ఈ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్లో సీనియర్ యాక్టర్ బాబూ మోహన్ ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. రాకెట్ రాఘవ స్కిట్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, డైలాగులు చెప్పడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. స్కిట్ చేస్తూ చేస్తూ ‘నా 41 ఏళ్ల సినీ కెరీర్లో ఎప్పుడూ ఇలా చేయలేదు’ అంటూ అందరినీ నవ్వించేశారు.

ల్యాప్టాప్లు, పాత బట్టలు రెంట్కి!
అమెరికాతో ఆరు నెలలుగా వార్ నడుస్తుండటంతో ఇరాన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువయ్యాయి. రోజూ వాడే వస్తువుల రేట్లు, మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోవడంతో జనం బతకడానికి చాలా కష్టపడుతున్నారు. ఇన్ కమ్ లేక చాలామంది తమ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, పాత బట్టలు, పర్ఫ్యూమ్లు, చెప్పులను ఆన్లైన్లో అమ్ముతున్నారు లేదా రెంట్కి ఇస్తున్నారు. ఉమెన్ అయితే తమ హెయిర్ని కూడా అమ్మేస్తున్నారు. అక్కడ ఇన్ఫ్లేషన్ 66% దాటడంతో జనం ఇలా సర్వైవ్ అవ్వాల్సి వస్తోంది.
నేను జీతం, పెన్షన్ తీసుకోను: మమతా బెనర్జీ
TMC అధినేత్రి మమతా బెనర్జీ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి జీతం లేదా పెన్షన్ తీసుకోకుండా, కేవలం తన పుస్తకాల రాయల్టీపైనే ఆధారపడి జీవిస్తున్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారని ఆరోపించారు. హక్కుల కోసం ప్రొటెస్ట్ చేస్తున్న యంగ్ జనరేషన్ను యాంటీ నేషనల్స్గా ముద్రవేస్తున్నారని, రాముడి పేరు చెప్తూ గుళ్లలోని హుండీలను కూడా లూటీ చేస్తున్నారని BJPపై మండిపడ్డారు.

అయ్యో పాపం: చిన్నారి బాడీలో ఇరుక్కుపోయిన సూది!
మహారాష్ట్ర ఠాణేలోని మున్సిపల్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రేబీస్ వ్యాక్సిన్ కోసం వచ్చిన మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. డాక్టర్లు ఆ విషయం పట్టించుకోకుండా చిన్నారిని ఇంటికి పంపేశారు. పాప తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ముంబైలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్రే తీసి, సర్జరీ ద్వారా సూదిని బయటకు తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Appleను ఇండియాలోనే కట్టిపడేయడానికి కొత్త ట్యాక్స్ ప్లాన్..
విదేశీ కంపెనీలు తమ మెషినరీని ఇండియాలోని కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్స్కు ఇచ్చి ప్రొడక్ట్స్ తయారు చేయించినప్పుడు లభించే ట్యాక్స్ మినహాయింపును 2041 వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. Apple కంపెనీ కూడా గతంలో ఈ ట్యాక్స్ రూల్స్పై ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రస్తుతం ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రిలీఫ్ అమల్లోకి వస్తే యాపిల్తో పాటు ఇతర విదేశీ కంపెనీలు కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్ను మరింత పెంచే అవకాశం ఉంది

'దూకుడు' ఈజ్ బ్యాక్.. మహేష్ ఫ్యాన్స్ రెడీనా?
మహేష్ ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్..! బ్లాక్బస్టర్ హిట్ 'దూకుడు' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ రీ-రిలీజ్ అవుతోంది, దీనికి ట్రైలర్ కూడా వచ్చేసింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్-కామెడీ అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్ . ఈసారి బిగ్ స్క్రీన్పై మహేష్ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఇప్పటికే కౌంట్డౌన్ మొదలుపెట్టారు.

LIC Share ఒక్కరోజే 9% పైగా Down.. అసలేం జరిగింది?
కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో 6.5% వరకు అమ్మేందుకు ఆఫర్ ఫర్ సేల్(OFS) తీసుకొచ్చింది. ఒక్కో షేర్కు ₹382 ఫ్లోర్ ప్రైస్ పెట్టగా, ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ ₹428.50తో పోలిస్తే ఇది దాదాపు 11% తక్కువ. దీంతో LIC షేర్పై సెల్లింగ్ ప్రెజర్ పెరిగి, ఒక దశలో స్టాక్ 9.26% వరకు పడిపోయింది. ఈ సేల్ పూర్తిగా జరిగితే ప్రభుత్వానికి దాదాపు ₹31,400 కోట్లు రావొచ్చని అంచనా. LICలో పబ్లిక్ షేర్హోల్డింగ్ పెంచేందుకు కూడా ఈ సేల్ ఉపయోగపడనుంది.