Latest
ప్రైవేట్ స్కూల్ వ్యాన్పై కన్వరియాల దాడి
లక్నోలో చారక్ క్రాసింగ్ వద్ద ప్రైవేట్ స్కూల్ వ్యాన్పై కన్వరియాలు దాడి చేసిన ఘటన కలకలంగా మారింది. వ్యాన్లో నర్సరీ నుంచి 5-6 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు. మూడు మోటార్సైకిళ్లపై ఆరుగురు కాన్వరియాలు వ్యాన్ను ఓవర్టేక్ చేయబోతూ చిన్నగా డ్యాష్ ఇచ్చారు. వాళ్లు డ్రైవర్ను దూషించి, వ్యాన్ వెనుక అద్దం, సైడ్ మిర్రర్లు పగలగొట్టారు. పిల్లలు భయపడగా, ఆలస్యమై ఓ అమ్మాయి టెస్ట్ కూడా మిస్ అయింది. పోలీసులు సీసీటీవీ, నంబర్ ప్లేట్ల ద్వారా వాళ్లని గుర్తించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

August 12న పగలే చీకటి..?
పట్టపగలే సూర్యుడు కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది..? 🌑😳 ఆగస్టు 12, 2026న టోటల్ సోలార్ ఎక్లిప్స్ జరగనుంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ సహా కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేసే అద్భుతమైన వ్యూ కనిపించనుంది. ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పార్షియల్ ఎక్లిప్స్ కనిపిస్తుంది. ఈ అరుదైన ఈవెంట్ను చూడటానికి ఇప్పటికే స్కైవాచర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సూర్యుడిని డైరెక్ట్గా చూడకుండా సర్టిఫైడ్ ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించడం తప్పనిసరి.

ఆయిల్ ప్రైస్ ఒక్కరోజులో 5% Down⛽
మిడిల్ ఈస్ట్లో ఒక్క అనౌన్స్మెంట్.. ఆయిల్ ధరల్లో భారీ మార్పు! ⛽📉 ఇరాన్పై దాడులను ప్రస్తుతానికి ఆపుతున్నట్లు ట్రంప్ చెప్పడంతో సోమవారం గ్లోబల్ ఆయిల్ ధరలు దాదాపు 5% పడిపోయాయి. మంగళవారం మాత్రం కొంత రికవరీ కనిపించింది. బ్రెంట్ క్రూడ్ సుమారు $84.75 దగ్గర ట్రేడ్ అయింది. US–Iran మధ్య టెన్షన్ తగ్గితే ఆయిల్ సప్లైపై ఉన్న భయం తగ్గొచ్చనే ఆశ మార్కెట్స్లో కనిపిస్తోంది. కానీ హోర్ముజ్ పరిస్థితి ఇంకా క్లియర్ కాకపోవడంతో ఆయిల్ మార్కెట్ ఫుల్గా రిలాక్స్ కాలేదు.

FAKE or FACT..RSS యూనిఫాం మారబోతుందా?
RSS(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సభ్యుల యూనిఫాం మారబోతుందని, Gen Z కోసం బ్యాగీ ప్యాంట్లు, క్యాప్స్, టీ-షర్టులు వేసుకుంటున్నారని ఓ వార్త నెట్లో వైరల్ అవుతోంది. ఇది నిజమేనా? కాదు. ఈ పోస్ట్ ‘The Fauxy’ అనే సెటైరికల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. వాళ్లు నకిలీ, సరదా వార్తలు రాయడంలో ఫేమస్. ఇది కూడా అలాంటిదే! RSS ఇప్పటికీ తమ సంప్రదాయ యూనిఫాంనే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది FAKE.

గాజా పీస్ ప్లాన్ ఒకవైపు.. గ్రౌండ్లో అటాక్స్ మరోవైపు!
పీస్ డీల్ ముందుకు వెళ్తోందంటున్నారు.. కానీ గాజాలో పరిస్థితి మాత్రం వేరేలా ఉందా? హమాస్ను నిరాయుధం చేసి యుద్ధాన్ని ముగించే ప్లాన్ ముందుకు వెళ్తోందని ట్రంప్ చెబుతున్నా, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన దాడుల్లో 18 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు Reuters తెలిపింది. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ముందుగా ఆయుధాలు వదలాలని అంటుండగా, హమాస్ ఇజ్రాయెల్ ముందుగా దాడులు ఆపి వెనక్కి వెళ్లాలని చెబుతోంది. అంటే పీస్ ప్లాన్ ఉన్నా.. “ఫస్ట్ ఎవరు?” అన్న దగ్గరే పెద్ద సమస్య కొనసాగుతోంది.

📈 ఏపీ వృద్ధి తెలంగాణ కంటే ఎక్కువ: చంద్రబాబు
AP Economy గురించి CM చంద్రబాబు నాయుడు డేటా రిలీజ్ చేశారు. 2024–26లో ఏపీ growth rate 11.3% గా నమోదై తెలంగాణ 10.7% కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.2019–24లో AP Growth 13.5% నుంచి 10.3%కి పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. అమరావతికి ₹10,000 కోట్లు, పోలవరానికి ₹8,300 కోట్లు ఇచ్చి Investors నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చామని అన్నారు. ఈ నంబర్స్పై ఇప్పుడు AP రాజకీయాలు హీట్ ఎక్కేలా ఉన్నాయి.
ఆ రెండు రోజులు హరీశ్ రావు ఎక్కడున్నారు- మహేష్ కుమార్ గౌడ్
TG: రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు 'క్షుద్ర పూజలు' చేస్తున్నారని TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అరుంధతి సినిమా తరహాలో తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ఆలయాల్లో పూజలు నిర్వహించారని, తమ వద్ద పక్కా Proofs ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 2, జూలై 23 తేదీల్లో హరీశ్ రావు ఎక్కడున్నారో క్లారిటీ ఇవ్వాలని, రాజకీయ స్వార్థం కోసమే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మహిళపై రేప్ అటెంప్ట్.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే వినోద్ సింగ్పై ఒక మహిళ లైంగికదాడి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తన గన్నర్ ధనంజయ్ యాదవ్ ద్వారా తనను పిలిపించాడని చెప్పారు. మద్యం తాగి, ప్రైవేట్ భాగాలను తాకి, బట్టలు చింపి రేప్ చేయడానికి ప్రయత్నించాడని ఆమె వివరించారు. తన 10 ఏళ్ల కుమార్తెపై యాసిడ్ అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. లక్నో హజ్రత్గంజ్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా FIR నమోదు కాలేదని వివరించారు. మహిళా కమిషన్కు వెళ్లిన తర్వాత తనపైనే 420 కేసు పెట్టారని అన్నారు.

నెక్స్ట్ UN Chief ఎవరు..? రేస్ మొదలైంది!
ప్రపంచంలోనే టాప్ డిప్లొమాటిక్ జాబ్.. ఇప్పుడు ఎవరి చేతికి వెళ్తుంది..? 👀🌍 ప్రపంచ దేశాలు కలిసి పనిచేసే ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుండటంతో, ఆయన తర్వాత ఎవరు వస్తారన్న రేస్ మొదలైంది. తొలి ఇన్ఫార్మల్ పోల్లో కోస్టారికాకు చెందిన రెబెకా గ్రిన్స్పాన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు రాయిటర్స్ రిపోర్ట్ తెలిపింది. రెండో UN సెక్యూరిటీ కౌన్సిల్ పోల్ను ఆగస్టు 21న నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

Metaకి భారత్ నుంచి సమన్లు..! 📞
గతవారం ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేస్బుక్ పోస్టును మెటా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేసి, తర్వాత అది టెక్నికల్ ప్రాబ్లమ్ అని క్షమాపణ చెప్పింది. ఇప్పుడు ఆ అంశంతో పాటు పిల్లల భద్రత(CSAM), కంటెంట్ మోడరేషన్, వెరిఫైడ్ అకౌంట్ల భద్రతపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెటా గ్లోబల్ టీంను ఆగస్టు 5-6వ తేదీల్లో పిలిచింది. ఈ భేటీ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందనేదానిపై టెన్షన్ నెలకొంది.
విజయ్..ఉదయనిధి మధ్య మొదలైన వార్?
CM జోసఫ్ విజయ్, హీరోయిన్ త్రిష గురించి తప్పుగా మాట్లాడరన్న ఆరోపణతో తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ దొరికింది. ఈ విషయం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “నేను ఎవరి పేరు చెప్పలేదు. చెడు ఉద్దేశంతో మాట్లాడలేదు. వాళ్లంతా ఓ మూర్ఖుల గుంపు” అని కామెంట్ చేశారు. ఈ ఘటనతో విజయ్-ఉదయనిధి మధ్య క్లియర్ కట్ వార్ మొదలైందని అంతా భావిస్తున్నారు.

ఆరు దాటాక బయటకు రావాలంటే హడల్
AP: శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస టిడ్కో కాలనీలో ఆరుగురు యువకుల వల్ల సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కాలనీవాసులు హడలిపోతున్నారు. ఈ నెల 2న రోడ్డుపై పిల్లలు ఆడుతుండగా కొందరు యువకులు బైక్ల మీద వేగంగా వచ్చారు. శెట్టి చిన్నారావు వాళ్లని నిలదీయడంతో ఆయన్ని కొట్టారు. బైక్లపై వచ్చేవాళ్లని ఎవరైనా ఆపితే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో జనాలు హడలిపోతున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కుదుపులు.. 12 మంది!
థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపుల(టర్బులెన్స్)ను ఎదుర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు క్యాబిన్ స్టాఫ్ తో పాటు 12 మంది గాయపడ్డారు. ఫ్లైట్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానం దిల్లీ ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే ఎయిర్ పోర్టులోని హెల్త్ సెంటర్కు పంపినట్లు తెలిపింది. ప్యాసెంజర్, స్టాఫ్ సేఫ్టీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొన్న సంస్థ, ఘటనపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
మూవీ డేట్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్!
'కొరియన్ కనకరాజు' మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ మరియు కమెడియన్ కలిసి ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో 'కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7న వస్తున్నాడు' అనే ఒక్క డైలాగ్నే యాంగ్రీ, శాడ్, డిస్గస్టింగ్, హ్యాపీ, ఫ్లర్టీ వంటి డిఫరెంట్ ఎమోషన్స్లో వీళ్లు చెప్పారు. ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలోకి రాబోతుండగా, ఈ వినూత్న ప్రమోషనల్ వీడియోలో నటీనటులు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఆడియన్స్కు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.

వివాదంలో రణబీర్-సాయిపల్లవిల ‘రామాయణ’
రణబీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీని ఎదుర్కొంటోంది. సినిమాలో కొన్ని డైలాగులు, సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నట్లు ఢిల్లీలోని శ్రీరామ్లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్రబృందానికి లెటర్ రాశారు. విడుదల కంటే ముందే స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అబ్జెక్షన్ ఉన్న సీన్స్ను తొలగించకపోతే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నది దాటుతూ స్కూల్కు.. సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో స్కూల్కు వెళ్లేందుకు పిల్లలు బేత్వా నదిపై డ్యామ్ను దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ ఈ దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విచారణలో ఈ వీడియో విదిశా జిల్లా పలోహ్ గ్రామంలోనిదిగా అధికారులు గుర్తించారు. పలోహ్హై స్కూల్కు వెళ్లేందుకు ఈ దారిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు అందించడంతో పాటు వంతెన నిర్మిస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.
నందిగామలో పసుపు రంగు కప్పల కలకలం!
ఆంధ్రప్రదేశ్లోని NTR జిల్లా నందిగామలో వర్షాల కారణంగా వింత సంఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పసుపు రంగు కప్పలు గుంపులుగా బయటకు రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇవి 'ఇండియన్ బుల్ఫ్రాగ్' జాతికి చెందిన మగ కప్పలని, మేటింగ్ సీజన్ (సంభోగ కాలం) లో ఆడ కప్పలను అట్రాక్ట్ చేసేందుకే ఇలా బ్రైట్ ఎల్లో కలర్లోకి మారతాయి. మీకు ఈ ఇండియన్ బుల్ఫ్రాగ్ గురుంచి తెలిస్తే కామెంట్ చేయండి.

బూడిదవుతున్న వాషింగ్టన్!
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రాన్ని దారుణమైన కార్చిచ్చు ముంచెత్తింది. ఏకంగా 16 ప్రాంతాల్లో మంటలు తీవ్రరూపం దాల్చడంతో వందలాది భవనాలు కాలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు, మరో 60 వేల మందిని సేఫ్ గా ఉండే షెల్టర్లకు తరలించారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను కంట్రోల్ చేయడం రెస్క్యూ టీమ్లకు సవాలుగా మారింది. సేఫ్టీ కారణాల వల్ల డ్రోన్లు ఎగరేయడాన్ని అధికారులు ఆపేశారు.

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధికి బెయిల్!
CM విజయ్, నటి త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన తరువాత అయన మద్రాస్ కోర్టుకు వెళ్లారు. అదే రోజు స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఉదయనిధికి తాత్కాలిక రిలీఫ్ దక్కింది.

యూట్యూబ్, ఫేస్బుక్లను వెనక్కి నెట్టిన ఇన్స్టాగ్రామ్..
భారతీయులు రోజుకు సగటున గంటా 39 నిమిషాలు ఇన్స్టాగ్రామ్లోనే గడుపుతున్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ సర్వే తెలిపింది. నెలకు సగటున వినియోగించే యాప్స్ లో 'ఇన్స్టాగ్రామ్' 49 గంటల 42 నిమిషాలతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 'యూట్యూబ్' 47 గంటల 23 నిమిషాలు, 'ఫ్రీఫైర్ గేమ్' 41 గంటల 12 నిమిషాలు, 'ఫేస్బుక్' 24 గంటల 45 నిమిషాలు, 'జియో హాట్స్టార్' 22 గంటల 13 నిమిషాలతో తదపరి స్థానాల్లో నిలిచాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్కే భారతీయులు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.

భారీ వర్షాలు.. వాగుల వద్ద హైఅలర్ట్
TG: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లింగంపేట, మేంగారం, ఐలాపూర్, మోతే గ్రామాల చెరువులు నిండగా, తిమ్మారెడ్డి కల్యాణి ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు అలుగు పారుతున్నాయి. లింగంపేట వద్ద పాములవాగు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కామారెడ్డి–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు.