Latest

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధికి బెయిల్!
CM విజయ్, నటి త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన తరువాత అయన మద్రాస్ కోర్టుకు వెళ్లారు. అదే రోజు స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఉదయనిధికి తాత్కాలిక రిలీఫ్ దక్కింది.

యూట్యూబ్, ఫేస్బుక్లను వెనక్కి నెట్టిన ఇన్స్టాగ్రామ్..
భారతీయులు రోజుకు సగటున గంటా 39 నిమిషాలు ఇన్స్టాగ్రామ్లోనే గడుపుతున్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ రీసెర్చ్ సర్వే తెలిపింది. నెలకు సగటున వినియోగించే యాప్స్ లో 'ఇన్స్టాగ్రామ్' 49 గంటల 42 నిమిషాలతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 'యూట్యూబ్' 47 గంటల 23 నిమిషాలు, 'ఫ్రీఫైర్ గేమ్' 41 గంటల 12 నిమిషాలు, 'ఫేస్బుక్' 24 గంటల 45 నిమిషాలు, 'జియో హాట్స్టార్' 22 గంటల 13 నిమిషాలతో తదపరి స్థానాల్లో నిలిచాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్కే భారతీయులు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.

భారీ వర్షాలు.. వాగుల వద్ద హైఅలర్ట్
TG: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లింగంపేట, మేంగారం, ఐలాపూర్, మోతే గ్రామాల చెరువులు నిండగా, తిమ్మారెడ్డి కల్యాణి ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు అలుగు పారుతున్నాయి. లింగంపేట వద్ద పాములవాగు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కామారెడ్డి–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు.

ప్రోటోకాల్ పాటించలేదని MLA వాకౌట్
AP: NTR జిల్లా ఎ.కొండూరు మండలం అట్లప్రగడలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కార్యక్రమానికి హాజరైన MLA కొలికపూడి శ్రీనివాసరావు, MROతో పాటు సంబంధిత అధికారులు గైర్హాజరైన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ మాత్రమే హాజరుకావడంతో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అనంతరం సంబంధిత అధికారులు తన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ MLA అక్కడి నుంచి వెళ్లిపోయారు.
FACT or FAKE..పోలీసులపై కన్వరియాల దాడి?
యూపీలో కన్వర్ యాత్ర సమయంలో కన్వరియాలు పోలీసుల బట్టలు చించి కర్రలతో కొట్టారనే వార్త వైరల్ అవుతోంది. దిల్లీ-దెహ్రాడూన్ హైవేపై దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే దీనిపై మీరట్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది రెండు కన్వరియా గ్రూపుల మధ్య ఘర్షణ అని తేల్చారు. వీడియోలో కనిపించేవారు పోలీసులు కాదని, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశామని చెప్పారు. కాబట్టి ఈ వార్త FAKE.

దేశం ఖర్చులో 43% Gen Z చేతుల్లో.. ఇంత పవర్ ఉందా? 😳
Gen Z అంటే రీల్స్, మీమ్స్ మాత్రమే అనుకుంటున్నారా..? వాళ్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న స్పెండింగ్ ఏకంగా $860B (₹72 లక్షల కోట్లు)!👀 ఇండియాలో దాదాపు 37.7 కోట్ల Gen Z ఉన్నారని <a href="https://www.bcg.com/publications/2024/india-the-2-trillion-opportunity-how-gen-z-is-shaping-the-new-india?linkId=629656651&utm_source=chatgpt.com">BCG </a>రిపోర్ట్ చెబుతోంది. వీళ్లు దేశంలోని కన్జ్యూమర్ స్పెండింగ్లో దాదాపు 43% అంటే $860 బిలియన్ విలువైన కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నారట. ఇందులో $200 బిలియన్ డైరెక్ట్గా వాళ్లు ఖర్చు చేస్తుండగా, మరో $660 బిలియన్ ఫ్యామిలీ కొనుగోళ్లపై వాళ్ల ఇన్ఫ్లుయెన్స్తో జరుగుతోంది. 2035 నాటికి ఈ స్పెండింగ్ పవర్ $2 ట్రిలియన్కు చేరొచ్చని అంచనా.
2 లక్షల పిటిషన్లతో మోదీ ఇంటికి వెళ్తాం: అరవింద్ కేజ్రీవాల్
ట్రంప్ ఒత్తిడితో అమెరికా నుంచి భారీగా ఇథనాల్ కొంటున్నారని ప్రధాని మోదీపై AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ డెసిషన్తో సామాన్యుల వాహనాలు డ్యామేజ్ అయ్యాయని ఆయన 'X' పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2 లక్షలకు పైగా పిటిషన్లతో ప్రధాని ఇంటికి వెళ్తున్నామని తెలిపారు. ఇథనాల్ (E20) కారణంగా తమ వెహికల్స్ దెబ్బతిన్నాయని చెప్పే 100 మంది మాతో ఉన్నారని అన్నారు. ప్రజల గొంతును ప్రధాని తప్పకుండా వింటారని ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

ఫ్రిజ్ పైన వస్తువులు పెడుతున్నారా?
చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ఫ్రిజ్ పైన రకరకాల వస్తువులను ఉంచుతుంటారు. అలా పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫినాయిల్స్, యాసిడ్లు, బ్లీచింగ్ ప్రొడక్ట్స్ వంటి రసాయనాలు ఫ్రిజ్పై పెడితే అవి లీకై అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదముంది. వంటనూనెలు, పండ్లు ఉంచితే ఫ్రిజ్ వేడికి వాటి రుచి, వాసన పాడవుతాయి. వీటితో పాటు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, పేపర్లు, బరువైన సామాగ్రిని అసలు పెట్టకూడదు. అందుకే ఫ్రిజ్ పైభాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచడమే సురక్షితం.

మృతదేహం కోసం అంబులెన్స్ సిబ్బంది గొడవ
TG: మంచిర్యాలలో మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమైంది. మృతుడు నాగభూషణం కుటుంబసభ్యులు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తమకు తెలిసిన అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్తుండగా, ఆస్పత్రి వద్ద ఉన్న మరో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మా అంబులెన్స్లోనే తీసుకెళ్లాలని తిరిగి ఆస్పత్రికి రప్పించి వాగ్వాదానికి దిగారని తెలిపారు. విషాద సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాణాలను పణంగా పెట్టి చదువులు
TG: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య తరగతులకు హాజరవుతున్నారు. సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం భారీ వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారింది. గోడలు తడిసి పగుళ్లు ఏర్పడగా, తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. 143 మంది విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త పాఠశాల భవనం నిర్మించాలని, అప్పటి వరకు విద్యార్థులను సురక్షితమైన భవనానికి తరలించాలని కోరారు.

శ్రీశైలం ప్రాజెక్టులోకి 100 టీఎంసీలు
AP: ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది ప్రవాహం భారీగా వస్తోంది. ఉదయం జలాశయం నీటిమట్టం 858.70 అడుగులుగా, నీటి నిల్వ 101.9210 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,53,543 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 924 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటక నుంచి దిగువకు నీటి విడుదల పెరుగుతుండటంతో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ABHA నంబర్.. అంటే ఏంటో తెలుసా?
దేశంలోని ప్రతి ఇండియన్కు అందుబాటులో ఉన్న 14 డిజిట్స్ స్పెషల్ డిజిటల్ హెల్త్ ఐడీనే ABHA నంబర్. ఈ నంబర్ ద్వారా హెల్త్ రికార్డ్స్, ప్రిస్కిప్షన్లు, టెస్ట్ రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీలు సింగిల్ ప్లాట్ఫారమ్లో సేవ్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో పేపర్వర్క్ తగ్గడంతో పాటు, పేషెంట్ అనుమతితో హెల్త్ రికార్డ్స్ను షేర్ చేయవచ్చు. వేర్వేరు హాస్పిటల్లో హెల్త్ ట్రీట్మెంట్ కొనసాగడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ABHA నంబర్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా <a href="https://abha.abdm.gov.in/abha/v3/register">క్రియేట్ చేసుకోవచ్చు.</a> ఇండియాలో అందరు ఈ సర్వీస్ను యూజ్ చేసుకోవచ్చు.
నేను ఫుల్ నాన్-వెజిటేరియన్- CM రేవంత్ రెడ్డి
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లో ఫన్నీ కామెంట్స్ చేశారు. పక్కనే ఉన్న ఆఫీసర్ రామకృష్ణారావు ప్యూర్ వెజిటేరియన్ కాగా, CM రేవంత్ మాత్రం తాను ఫుల్ నాన్-వెజిటేరియన్ అంటూ సరదాగా చెప్పారు. వారంలో 7 రోజులు, రోజుకి 24 గంటలు నాన్-వెజ్ మాత్రమే తింటానని నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్తో ప్రెస్ మీట్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.
ఉప్పొంగిన వాగు.. రాకపోకలు బంద్
TG: కురిసిన భారీ వర్షాలతో యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు బ్రిడ్జిపైకి చేరడంతో సంగెం–భువనగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఎవరూ వరద నీటిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.

Gen Z మళ్లీ పేరెంట్స్ దగ్గరికే..
జాబ్ వచ్చింది, సిటీకి వెళ్లారు, ఇప్పుడు మళ్లీ పేరెంట్స్ దగ్గరికే వస్తున్నారా..? పెరుగుతున్న రెంట్స్, లివింగ్ కాస్ట్స్, జాబ్ అనిశ్చితి కారణంగా కొంతమంది Gen Z యువత తిరిగి ఫ్యామిలీతో కలిసి ఉండటాన్ని ఎంచుకుంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ట్రెండ్ను ‘బూమరాంగ్ జనరేషన్’ అని కూడా పిలుస్తున్నారు. బయట ఉండి శాలరీలో పెద్ద భాగం రెంట్కే ఇవ్వడం కంటే ఇంట్లో ఉండి సేవింగ్స్ పెంచుకోవడం బెటర్ అనే మైండ్సెట్ కనిపిస్తోంది. అంటే పేరెంట్స్తో ఉండటం ఇప్పుడు ఫెయిల్యూర్ కాదు.. ఫైనాన్షియల్ స్ట్రాటజీగా మారుతోందా?

స్థిరంగా బంగారం ధరలు!
అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలో గోల్డ్ రేట్ల స్పీడుకి చెక్ పడింది. గత రెండు సెషన్లుగా మార్కెట్లో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,220 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,32,190 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ. 1,08,150గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్తో గోల్డ్ రేట్లు పెరగకుండా ఉండటంతో బంగారం కొనేవారికి కాస్త రిలీఫ్ లభించింది.

పెద్దపులి మృతి కేసులో బిగ్ ట్విస్ట్
AP: మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులను గుంటూరు జిల్లా మేడికొండూరులో అదుపులోకి తీసుకున్నారు. 20రోజుల క్రితం ఉచ్చులో చిక్కి మృతి చెందిన పెద్దపులి కాళ్లు నరికి గోళ్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి పారదర్శక దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
‘అక్కడ నీళ్లు రావాల్సిందే’..చర్చగా మారిన ఉదయనిధి కామెంట్స్
తంజావూరులో కావేరి నిరసన సభలో ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘కావేరి నీళ్ల గురించి సీఎం విజయ్ నోరు విప్పడం లేదు. ఆయనకు డీఎంకేపై తప్పుడు కేసులు పెట్టడమే ముఖ్యం’ అని ఉదయనిధి ఆరోపించారు. ఆ టైంలో సభలోని వాళ్లు “త్రిష… త్రిష…” అని నినాదాలు చేశారు. ఉదయనిధి నవ్వుతూ “ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా, అక్కడ నీళ్లు రావాలి” అని కామెంట్ చేశారు. ఆ తర్వాత “నేను కావేరి నీళ్ల గురించే చెప్పాను” అని క్లారిఫై చేశారు.
హీరో సూర్య టాప్-5 సినిమాలు!
తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టాప్-5 ఫేవరెట్ సినిమా లిస్ట్లో విక్రమ్ నటించిన 'సేతు', అమీర్ ఖాన్ 'లగాన్', దర్శకుడు రాజమౌళి 'ఈగ' చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ 'ధురంధర్', సూర్య-జ్యోతికల 'కాఖా కాఖా' సినిమాలని తెలిపారు. ధురంధర్' మేకింగ్, రైటింగ్ అద్భుతంగా ఉందంటూ,'కాఖా కాఖా' షూటింగ్ సమయంలోనే జ్యోతికతో ప్రేమాయణం మొదలైందని సూర్య అన్నారు.

10th క్లాస్ అర్హతతో ఇండియా పోస్ట్లో ఉద్యోగాలు.. భారీ జీతం
ఇండియా పోస్ట్ బెంగళూరులోని మెయిల్ మోటర్ సర్వీస్ (MMS) డిపార్ట్మెంట్లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం 11 ఖాళీలు ఉండగా, వాటిలో 10 బెంగళూరు, ఒకటి మైసూరు సబ్డిపోలో ఉన్నాయి. సెలెక్టయిన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు శాలరీ ఉంటుంది. పదో తరగతితో పాటు లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఏజ్ 56 ఇయర్స్ లోపుండాలి. కావాల్సిన డాకుమెంట్స్ అన్ని <a href="https://www.indiapost.gov.in/vacancies">ఆఫ్లైన్</a> ద్వారా 60 రోజుల్లో బెంగళూరులోని MMS మేనేజర్కు మెయిల్ పంపాలి.

మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత
విద్యావేత్త, మాజీ గవర్నర్ డి.వై.పాటిల్(90) మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కన్నుమూశారు. 1935 అక్టోబర్ 22న ఆయన జన్మించారు. 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్గా, 2013 నుంచి 2014 వరకు బీహార్ గవర్నర్గా పనిచేశారు. 2014లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. పాటిల్ గ్రూప్ సంస్థలు స్థాపించి 182కు పైగా విద్యాసంస్థలు, 7 విశ్వవిద్యాలయాలు ప్రారంభించారు.