ఆ రెండు రోజులు హరీశ్ రావు ఎక్కడున్నారు- మహేష్ కుమార్ గౌడ్
TG: రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు 'క్షుద్ర పూజలు' చేస్తున్నారని TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అరుంధతి సినిమా తరహాలో తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ఆలయాల్లో పూజలు నిర్వహించారని, తమ వద్ద పక్కా Proofs ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 2, జూలై 23 తేదీల్లో హరీశ్ రావు ఎక్కడున్నారో క్లారిటీ ఇవ్వాలని, రాజకీయ స్వార్థం కోసమే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.



