మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత

విద్యావేత్త, మాజీ గవర్నర్ డి.వై.పాటిల్(90) మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కన్నుమూశారు. 1935 అక్టోబర్ 22న ఆయన జన్మించారు. 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్గా, 2013 నుంచి 2014 వరకు బీహార్ గవర్నర్గా పనిచేశారు. 2014లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. పాటిల్ గ్రూప్ సంస్థలు స్థాపించి 182కు పైగా విద్యాసంస్థలు, 7 విశ్వవిద్యాలయాలు ప్రారంభించారు.


