Latest

Today Political Updates..
1. ICUలో అన్నా హజారే 2. పవన్ కళ్యాణ్ బర్త్డే వేళ జనసేన యువజన విభాగం ఏర్పాటు. 3. ఢిల్లీ YSR అవార్డుల ఈవెంట్కు CM రేవంత్ హాజరు. 4. మంత్రివర్గ విస్తరణ చర్చల కోసం ఢిల్లీకి TPCC చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ CM భట్టి. 5. YS జగన్ పులివెందుల టూర్ కొనసాగింపు. 6. KCR రాజీనామా డిమాండ్తో కాంగ్రెస్ బైక్ ర్యాలీలు. 7. రేవంత్ 1000 రోజుల పాలనపై చార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ BRS నిరసనలు. 8. పాయకరావుపేటలో గోదావరి జలాలకు CM చంద్రబాబు జల హారతి.

పెంకుటింటికి లక్షల్లో కరెంట్ బిల్లు
TG: ములుగు జిల్లా ప్రేమ్నగర్లో ఓ పెంకుటింటికి ఏకంగా రూ.1.43 లక్షల విద్యుత్ బిల్లు రావడం కలకలం రేపింది. కొమ్మినేని ప్రసాద్ దంపతులు తమ ఇంటికి ఇంత భారీ బిల్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. 2024 నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగానికి జీరో బిల్లులు వచ్చేవని తెలిపారు. కొంతకాలంగా బిల్లులు ఇవ్వలేదని, తాజాగా ఆగస్టు నెలకు రూ.1,43,136 బిల్లు ఇచ్చారని చెప్పారు. బిల్లు చెల్లించలేదని విద్యుత్ అధికారులు ఇంటి కరెంట్ కనెక్షన్ తొలగించారని ఆరోపించారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ కెరీర్లోనే రికార్డ్!
ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ప్రకారం కేవలం 33% అమెరికన్లు మాత్రమే ఆయనను సపోర్ట్ చేస్తుండగా, 64% మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కెరీర్లోనే ఇది అతి తక్కువ రేటింగ్. ఇరాన్ వార్, పెరిగిన లివింగ్ కాస్ట్ వల్ల ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిందని సర్వే తెలిపింది. కేవలం 31% మాత్రమే మిలిటరీ యాక్షన్కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రభావం నవంబర్లో జరిగే అమెరికా మిడ్టర్మ్ ఎలక్షన్స్పై గట్టిగా పడే ఛాన్స్ ఉంది.

నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం
TG: పేరుకే నేషనల్ హైవే, గుంతలతో ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణ సమయం భారీగా పెరిగింది. గతంలో గంట పది నిమిషాల్లో చేరే మార్గంలో ప్రస్తుతం రెండుగంటల వరకు పడుతోంది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుష్టి గ్రామం వద్ద వంతెనపై భారీ గుంత ఏర్పడటంతో ఒకవైపు మాత్రమే వాహనాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది.

స్కూల్లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక స్కూల్లో మలేరియా టాబ్లెట్స్ (క్లోరోక్విన్) వికటించి 54 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మడివి జమున అనే 7 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా స్టూడెంట్స్ని భద్రాచలం హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందరి హెల్త్ కండిషన్ సేఫ్గానే ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు.

40 ఏళ్ల నుంచే ఈ చేంజెస్ మస్ట్!
70 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తి చెడిపోకుండా డిమెన్షియా నుండి కాపాడుకోవాలంటే 40 ఏళ్ల నుంచే బ్రెయిన్ హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. 40s మరియు 50s లో ఉండే బిపి, కొలెస్ట్రాల్, షుగర్, ఒబెసిటీ, డిప్రెషన్ వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. వీటిని అదుపు చేయడానికి వారానికి కనీసం 150 నిమిషాల ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ ఫుడ్ తినడం, మంచి నిద్ర, స్మోకింగ్ మానడం, రీడింగ్ లేదా పజిల్స్ ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ activeగా ఉండి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉంటుంది.

యువతి కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క
TG: గిరిజన యువతుల భద్రత కోసం హైదరాబాద్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆదివాసీ యువతులకు అండగా ఉండేలా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్లో అత్యాచారం, హత్యకు గురైన భద్రాద్రికొత్తగూడెం జిల్లా యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఒత్తిడిని జయించాలంటే క్రీడలు అవసరం: DGP
AP: పోలీసు విధుల్లో ఫిట్నెస్తో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని DGP హరీష్కుమార్ గుప్తా సూచించారు. మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ మైదానంలో ఏపీ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహిస్తున్న ‘స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’ను ఆయన ప్రారంభించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమన్వయంతో పనిచేయడం వంటి లక్షణాలు మెరుగుపడతాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ నెల 4 వరకు జరిగే పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,900 మంది పోలీసు క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Gen-Zకి FOMO కంటే JOMO ఎందుకు అవసరం?
ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తుంటే మనం కూడా వెళ్లాలి, అందరూ ఏదో ట్రెండ్ ఫాలో అవుతుంటే మనం కూడా చేయాలి.. ఈ ఫీలింగ్నే FOMO(Fear Of Missing Out) అంటాం. కానీ Gen-Zలో దీనికి విరుద్ధంగా JOMO అంటే Joy of Missing Out అనే ఆలోచన పెరుగుతోంది. అంటే ప్రతి ప్లాన్లో ఉండాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ తెలుసుకోవాల్సిన పనిలేదని. ఇలా మన టైమ్ను మనకు నచ్చిన పనులకు కేటాయిస్తే డిజిటల్ డిస్ట్రాక్షన్ తగ్గి, ఫోకస్, ప్రశాంతత పెరుగుతాయి. అందరినీ ఫాలో అవ్వడం కంటే.. మనకు నచ్చినట్టుగా ఉండటమే మంచి ఛాయిస్.

నిర్మల్లో నాగర్కర్నూల్ క్రీడాకారుల ఘన విజయం
TG: రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య క్రీడల్లో నాగర్కర్నూల్ జిల్లా జట్టు సత్తా చాటింది. నిర్మల్ జిల్లా NTR మినీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య టోర్నమెంట్లో నాగర్కర్నూల్ బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫైనల్లో నిర్మల్ జట్టును ఓడించి ప్రథమ బహుమతి సాధించింది. బాలుర జట్టు కూడా రాణించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వివరాలను వ్యాయామ ఉపాధ్యాయులు అంజి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్లను పలువురు అభినందించారు.

భూముల పేరుతో బురద రాజకీయాలు: పొంగులేటి
TG: 22ఏ భూములపై ప్రతిపక్షాల ఆరోపణలు బురదచల్లే ప్రయత్నమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిషేధిత భూముల జాబితాలో సమస్యలను పరిష్కరించిన తర్వాత కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమగ్ర భూసర్వేతో ఆబాదీ, పట్టా, ప్రభుత్వ భూముల సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న జాబితానే అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారన్నారు.

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.

మనిషి మారిపోయాడా.. లేక పరిస్థితులే మార్చాయా?
ఒకప్పుడు ఎంతో క్లోజ్గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తాడు? నిజానికి మనిషి ఒక్కసారిగా మారిపోడు. ఎదురైన అనుభవాలు, బాధలు, బాధ్యతలు, కొత్త పరిచయాలు.. ఇవన్నీ అతని ఆలోచనల్ని, ప్రవర్తనని నెమ్మదిగా మార్చుతాయి. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు మారడం అవసరం కూడా. అందుకే ఎవరో మారిపోయారని అనుకునే ముందు.. వాళ్లను మార్చిన పరిస్థితులేంటో కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనిషిని అర్థం చేసుకోవాలంటే.. అతని ప్రవర్తన మాత్రమే కాదు, అతను దాటిన దారిని కూడా చూడాలి.

Gen Z Instagram గ్రిడ్ను ఎందుకు ‘Ghost’ చేస్తోంది?
ఒకప్పుడు Instagramలో ఏ చిన్న విషయం జరిగినా పోస్ట్ చేయడం కామన్.. కానీ ఇప్పుడు Gen Zలో ఆ ట్రెండ్ మెల్లగా మారుతోంది. చాలామంది పబ్లిక్ గ్రిడ్లో పోస్టులు పెట్టడం తగ్గించి, Stories, Close Friends, DMs, ప్రైవేట్ గ్రూపుల్లోనే ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనినే “Ghost-posting” అని పిలుస్తున్నారు. కారణం కూడా ఆసక్తికరమే.. ప్రతి పోస్ట్కు లైక్స్, వ్యూస్, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించడం, సోషల్ మీడియా ఫాటిగ్ పెరగడం. అందరికీ కనిపించకుండా తమకు నచ్చిన వాళ్లతో మాత్రమే షేర్ చేయడం కొత్త ట్రెండ్గా మారుతోంది.

సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట: SI
AP: దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గుత్తి ఎస్ఐ అమిర్ ఖాన్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్ అవెన్యూలో మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రజల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పట్టణంలో చోటుచేసుకున్న దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వెంచర్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100కు ఫోన్ చేయాలని సూచించారు.

హమరా ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలి
TG: అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమరా ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని దత్తాపూర్ అంబేద్కర్ యువజన సభ్యులు నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యాఖ్యలు అంబేద్కర్ను గౌరవించే అభిమానులు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యాఖ్యలను పూర్తిగా పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు అంశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు యువజన సభ్యులు వెల్లడించారు.

మండల అధ్యక్షుడిగా చెన్నయ్య ఏకగ్రీవం
TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల మాదిగ దండోరా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొందుర్గ్ మండల కేంద్రంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు అనేగాళ్ల ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా పరిశీలకుడు రావుగల్ల బాబు, మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగిర్యాల గ్రామానికి చెందిన గూడెం చెన్నయ్యను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

విపత్తులపై విద్యార్థులకు అవగాహన
AP: విద్యార్థుల్లో విపత్తులపై అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (CARDS) స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని నగరం, బాపట్ల, కొల్లూరు, వేమూరు, కొల్లిపర మండలాల్లో 30 ఉన్నత పాఠశాలల్లో ‘చైల్డ్ లెడ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్’ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొల్లిపర మండలం వల్లభాపురం పాఠశాలలో 36 మంది విద్యార్థులకు విపత్తుల రకాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర నంబర్లపై PPT ద్వారా అవగాహన కల్పించారు.

CPSపై ఉద్యోగుల మహాగర్జన
TG: CPSను రద్దుచేసి OPS అమలు చేయాలంటూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్, అబిడ్స్ బీమా భవన్, కలెక్టరేట్ వద్ద, సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. సీపీఎస్ రద్దు హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. 30 ఏళ్లపాటు సేవలందించే ఉద్యోగులకు సీపీఎస్, ఐదేళ్ల పదవీకాలం ఉండే ప్రజాప్రతినిధులకు ఓపీఎస్ కొనసాగించడం అన్యాయమన్నారు.

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿
ఇప్పుడంటే సినిమా చూడాలంటే OTTలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు VCD, DVDల్లో సినిమాలు చూసేవాళ్లు. వాటికంటే ముందు వీడియో క్యాసెట్ల కాలం ఉండేది. VCRలో క్యాసెట్ పెట్టి టీవీలో సినిమా చూస్తుంటే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట చేరేవాళ్లు. ఆ తర్వాత VCD, DVDలు వచ్చాయి. షాప్కి వెళ్లి నచ్చిన సినిమా డిస్క్ తీసుకొచ్చి, ప్లేయర్లో పెట్టి చూసే రోజులు కూడా చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్లిక్తో సినిమా వస్తున్నా.. అప్పటి ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం స్పెషల్. ఆ రోజులు గుర్తున్నాయా? కామెంట్లో చెప్పండి.

తుక్కుగూడలో నర్సు హత్య..! కఠిన శిక్షకు SFI డిమాండ్
హైదరాబాద్లో 21 ఏళ్ల ఆదివాసీ యువతి, నర్సు దారుణ హత్యకు గురయ్యారు.<br>ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డివిజన్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వడ్ల, శ్రీకాంత్ మాట్లాడుతూ కేసును వేగంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. Prime కేర్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు.