సమస్యలతో విసిగిపోయారా? కలెక్టరేట్కి పదండి!

AP : కాకినాడ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ‘పీజీఆర్ఎస్’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేర్వేరుగా ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దరఖాస్తులు అందించవచ్చు. ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తుల పరిష్కార పరిస్థితి ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి అర్జీదారులు 1100 నంబర్కు ఫోన్ చేయవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.



