అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెడబయలు భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల మార్పిడి జరుగుతున్నట్లు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య గుర్తించింది. ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎంఆర్ఓకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని, డీఎస్ఓ, జాయింట్ కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపింది. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

