రాజ్కుమార్ మృతదేహం మాకు వద్దన్న కుటుంబసభ్యులు

TG: ఆరుగురిని క్రూరంగా హతమార్చిన నిందితుడు రాజ్కుమార్ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వగా, వారు అతని బాడీని తమ వెంట తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.



