10 మందిపై పోక్సో కేసు నమోదు
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ ఇంట్లో మైనర్ బాలుడు, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. సదరు బాలుడిని గ్రామస్థులంతా కలిసి ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. బాలుడు, అతనితో పాటు ఉన్న మరికొందరు కలిసి తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలిక తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో పదిమంది నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



