మార్చి 31 నాటికి పోలవరం పనులు పూర్తిచేస్తాం

APకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు 89శాతం పనులు పూర్తి అయ్యాయని, తొలిదశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని CM చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం 89శాతం పనులు పూర్తయ్యాయి. అనుకున్న టైమ్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, స్పిల్ వే రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ సహా పలు పనులు పూర్తయ్యాయన్నారు. 2027 మార్చి నాటికి మిగతా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. తాను ఇప్పటికి 37సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, 136 సార్లు వర్చువల్గా సమీక్షించానని గుర్తుచేశారు.



