కలెక్టరేట్లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది

TG: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని గ్రేవెన్స్ డే ప్రొగ్రామ్లో ఓ గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది జరిగింది. పర్వతగిరి విలేజ్కు చెందిన ఓ మహిళ గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో తన భూమి పోవడంతో నష్టపరిహారం కోసం కలెక్టర్ ఆఫీస్కు వచ్చింది. కలెక్టరేట్లో అటెండర్గా పనిచేస్తున్న మురళి నీ పనిచేసి పెడతాను, లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు. ఊరు చివరికి తీసుకెళ్లి మిస్ బిహేవ్ చేయడంతో ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్కి వచ్చి మురళిని పట్టుకుని చెప్పులతో సామూహికంగా దేహశుద్ది చేశారు.



