బొలెరో టైర్ పేలి ముగ్గురు స్పాట్డెడ్
AP: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు రెడీమేడ్ ప్రహరీ గోడలు తీసుకొని వెళ్లుతున్న బొలెరో వాహనం టైర్ పేలింది. రంగంపేట మండలం వడిశలేరు ADB రోడ్డు వద్ద బొలెరో వెనక టైర్ పేలడంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు కాగా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. మృతులు మురమళ్ళ రాజు, తాతపూడి రాజేష్, మసకపల్లి బాలుగా గుర్తించారు.



