← Back to news

బొలెరో టైర్ పేలి ముగ్గురు స్పాట్‌డెడ్

By డీకే· 23 Jun 2026· Hmtvlive· కాకినాడ జిల్లా

AP: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు రెడీమేడ్ ప్రహరీ గోడలు తీసుకొని వెళ్లుతున్న బొలెరో వాహనం టైర్ పేలింది. రంగంపేట మండలం వడిశలేరు ADB రోడ్డు వద్ద బొలెరో వెనక టైర్ పేలడంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు కాగా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మురమళ్ళ రాజు, తాతపూడి రాజేష్, మసకపల్లి బాలుగా గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.