నసీరాబాద్లో పశువులతో పంటల ధ్వంసం... రెండు ఊర్ల కొట్లాట
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం నసీరాబాద్ శివారులో రైతుల పంటలు ధ్వంసం అయ్యాయి. రాంపూర్ వాసులు పశువులను పంటలపైకి వదలడంతో – రైతులు రాములు చిన్నయ్య, మల్లేష్, శ్రీనివాస్ మొదలైన వారి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అడ్డుకున్న నసీరాబాద్ ప్రజలపై రాంపూర్ వాసులు జేసీబీతో అడ్డం పెట్టి గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్ స్పందించి పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం ముకేష్ ఆధ్వర్యంలో రైతులు తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు

