ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానం

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నాగర్కర్నూల్ ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. వక్ఫ్ కాంప్లెక్స్ ముందు ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహ్మాన్, కౌన్సిలర్ మహమ్మద్ నిజాం, సీనియర్ జర్నలిస్ట్ అహ్మదుల్లా ఖాన్ ప్రారంభించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.


