← Back to news

🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు

By rajaratnam· 25 Aug 2026· కట్టుమోతులగూడెం
🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు

AP : ఏలూరు జిల్లా కట్టుమోతులగూడెంలో తాగునీరు లేక 15 ఏళ్లుగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కొళాయిల నుంచి బురద, కలుషిత నీరు రావడంతో పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు, మహిళలు నిరాహార దీక్ష చేశారు. 300 నుండి 400 ఫ్యామిలీస్ ఉండే ఈ ఊళ్లో కనీసం డ్రైనేజీ కూడా లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే కొత్త బోర్ వేసి మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.