← Back to news

కరెంట్ షాక్‌తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు

By Jelandharkoti Koti· 23 Aug 2026· మోకాసిగూడెం
కరెంట్ షాక్‌తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు

TG : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజి దగ్గర విద్యుత్ ప్రమాదం జరిగింది. 33 కేవీ కరెంట్ స్తంభానికి తగులుతున్న చెట్టు కొమ్మలను నరకడానికి జూనియర్ లైన్‌మెన్ మహేందర్ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో అనుకోకుండా కరెంట్ షాక్ తగలడంతో ఆయన స్తంభం పైనుంచి కింద పడిపోయాడు. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి, 108 అంబులెన్స్‌లో లైన్‌మెన్ చికిత్స కోసం లక్షిట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

More in Local