← Back to news

అక్రమ నిర్మాణాలు ఆపాలి

By NANI· 25 Aug 2026· కాకినాడ
అక్రమ నిర్మాణాలు ఆపాలి

AP : కాకినాడ జిల్లా పారుపాక గ్రామంలోని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరున్న ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌కు, మంగళవారం స్థానిక MPDOకి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో కుల, మతపరమైన కట్టడాలు కడితే భవిష్యత్తులో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయి, ఆ ల్యాండ్‌ను కాపాడి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.