అక్రమ నిర్మాణాలు ఆపాలి

AP : కాకినాడ జిల్లా పారుపాక గ్రామంలోని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరున్న ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కాకినాడ కలెక్టర్కు, మంగళవారం స్థానిక MPDOకి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో కుల, మతపరమైన కట్టడాలు కడితే భవిష్యత్తులో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయి, ఆ ల్యాండ్ను కాపాడి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు.


