దేవుడికి వెండి ప్లేటు.. ఇలాంటి దాతృత్వం మరెక్కడైనా?

పల్నాడు దాచేపల్లి బట్రుపాలెంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు రూ.2.50 లక్షల విలువైన 1 కిలో వెండి ప్లేటుని విరాళంగా అందజేశారు. కోలా కుమారస్వామి రెడ్డి, నారాయణమ్మ దంపతులు, వారి కుమారుడు వెంకట నరసింహారెడ్డి, తులసి దంపతులు స్వామివారికి నైవేద్యం కోసం ఈ ప్లేటును సమర్పించారు. అయితే, భక్తి, సంప్రదాయాలను గౌరవిస్తూనే – ఇలాంటి దాతృత్వం "మొదట సమాజం, తర్వాత ఆలయం" అనే ధోరణిని ప్రోత్సహిస్తే, ప్రభుత్వ స్కూళ్లు,, ఆసుపత్రులు, తాగునీటి కేంద్రాలు బాగుపడతాయని, ఇలా కూడా ఆలోచన చేయాలని పరిశీలకులు అంటున్నారు.

