డ్రగ్స్ నిర్మూలన పౌరులందరి సామాజిక బాధ్యత

AP: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యతతోపాటు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరిలో ఏపీ ఈగల్–ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మధ్య డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అవగాహన, నిఘా, పునరావాసం, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే ఈగల్ టోల్ఫ్రీ 1972కు తెలియ జేయాలని సూచించారు.


