← Back to news

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 5కే రన్

By VIJAY KUMAR· 24 Aug 2026· Narsampet (Ct), Narsampet, Warangal

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాని పబ్లిక్ పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా 5కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నర్సంపేట సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

More in Local