దేశం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి

TG: కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీస్ వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.



