చిట్ఫండ్ వ్యాపారం నిర్వహించిన HM సస్పెండ్

TG: చిట్ఫండ్ వ్యాపారం నిర్వహించిన HMను అధికారులు సస్పెండ్ చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని శర్వాపురం MPPS ప్రధానోపాధ్యాయుడు బెక్కం వీరయ్యపై ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంపై కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు చండూరు ఆర్డీవో శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో వీరయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.



