బాంకీపూర్ బైపోల్: ప్రశాంత్ కిషోర్కు 16,000 ఓట్ల భారీ ఆధిక్య

బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. మొత్తం 31 రౌండ్లలో 26 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై దాదాపు 16,000 ఓట్ల స్పష్టమైన ముందంజలో ఉన్నారు. దీంతో 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యం ప్రమాదంలో పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.


