హాస్టల్లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి

TG: జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణ ఘటన జరిగింది. SC హాస్టల్లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ హాస్టల్ వెనుక ఉన్న కుంటలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన 5th క్లాస్ స్టూడెంట్ విష్ణు(11), జగిత్యాలకు చెందిన 4th క్లాస్ స్టూడెంట్ సుశాంత్(10) ఉన్నారు. దీంతో అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



