← Back to news

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

By DK· 19 Jul 2026
చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

TG: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఫీర్జాదిగూడలోని సమీపంలోని ఓ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకినట్లు గుర్తించారు. తేజస్విని మృతదేహం లభించగా, కేసులో విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో DRF సిబ్బంది బోట్ల సహాయంతో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె నెలకు దాదాపు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్, CCTV ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 15h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.