ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి బంగారం దోచేశారు

TG: హైదరాబాద్లోని చందానగర్ బాలాజీ జ్యువెలరీ షాప్లో నిన్న అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు, తలుపుకు రంధ్రం చేసి సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తుండగా, CCTV ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.



