'మార్నింగ్ లేవగానే ఫోన్ల వాడకాన్ని తగ్గించాలి'

TG: ప్రతిఒక్కరూ మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి యోగా, వ్యాయామం చేయాలని మినిస్టర్ సీతక్క సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ZPHS బాలుర పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. ప్రతిరోజు ప్రతిఒక్కరూ యోగా చేయడం ద్వారా పలు రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని తెలిపారు.



