← Back to news

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి

By dk· 15 Aug 2026· కడప జిల్లా
గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి

AP: కడప జిల్లా వల్లూరులో క్షుద్రపూజలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచెర్లకు చెందిన విజయ్‌కుమార్, చిత్తూరుకు చెందిన హేమంత్, సుబ్రహ్మణ్యం గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసేందుకు ఓ బాలికను డబ్బు ఆశచూపి నగ్న పూజలకు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పూజలకు అడ్డుగా ఉన్న నాగసాయి ప్రణవ్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమై వేటకత్తితో దాడిచేశారన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.