చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కొత్త అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అరకు ఎంపీ తనూజారాణి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ను సమకూర్చారు. ఈ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నోఖ్వాల్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాలలో ఈ అంబులెన్స్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

