భోజనం లేట్ అయ్యిందని వదినపై దారుణం

బీహార్లోని జెహానాబాద్ జిల్లాలో భర్త పొలానికి వెళ్లగా భార్య అన్షు దేవి(25) ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమె మరిది 'కునాల్' ఇంటికి వచ్చి భోజనం అడిగాడు. అన్నం పెట్టడం లేట్ అవ్వడంతో గొడ్డలి తీసుకొని వదిన తల నరికేశాడు. ఆ తలను ఇంటి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీసి, పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. అక్కడి వాళ్లు పోలీసులకు చెప్పడంతో వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కునాల్ ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉండేవాడనీ ఊరివాళ్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.



