ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారు: రేవంత్రెడ్డి
TG: BJP అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నీట్ పేపర్లను బఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్లు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అన్నారు.



